ఎప్పటిలాగానే శుక్రవారం రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు అపాచీకి సంబంధించి ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో కాజల్ సంచాలకురాలిగా ఉండగా, ఆటలో సన్నీ, షణ్ముఖ్, మానస్ పోటీ పడ్డారు. అయితే సన్నీ టాస్క్లో విన్ అయ్యాడు. కాకపోతే ఓ ప్రశ్నని గట్టిగా చదవలేదు. దాంతో సంచాలకురాలుగా ఉన్న కాజల్.. తన తప్పుని ఒప్పుకుంటూ.. చివరికి సన్నీని విజేతగా ప్రకటించింది.
అయితే షణ్ముఖ్ని కాకుండా సన్నీని విన్నర్గా ప్రకటించడంతో సిరి అగ్గి మీద గుగ్గిలంలా మారింది. ఓ వైపు నేను సంచాలకురాలుగా విఫలం అయ్యాయని కాజల్ ఒప్పుకున్నా.. నువ్ విఫలం అయ్యావ్ విఫలం అయ్యావ్ అంటూ పదే పదే అంటూ గొడవకు దిగింది. మీకో న్యాయం మాకో న్యాయమా? అంటూ రచ్చ రచ్చ చేసింది. దీంతో ఇది నాకు వద్దు.. షన్నూకి ఇచ్చెయ్ అని అన్నాడు సన్నీ.
ఇక కిచెన్లోకి వచ్చిన తరువాత కూడా సిరి శాంతించలేదు.. వెళ్లిపోయే ముందు కూడా ఇలాగే చేస్తారా అంటూ సిరి నోరుపారేసుకోవడంతో… సన్నీ రియాక్ట్ అయ్యాడు.. తన తప్పు తాను ఒప్పుకుంది కదా.. వదిలెయ్.. ఇన్ని మాటలు వద్దు.. చాలా అంటున్నావ్.. వెళ్లిపోయే ముందు అని అనడం వద్దు అని సన్నీ అన్నాడు. దీంతో సిరి.. నా ఇష్టం, బరాబర్ నేను మాట్లాడతా.. నన్ను మాట్లాడొద్దని ఎలా అంటావ్.. నువ్ వింటే విను.. లేదంటే మానెయ్ అంటూ రెచ్చిపోయింది. ఫైనల్గా సంచాలకురాలిదే తుది నిర్ణయం కావడంతో కాజల్ సన్నీని విజేతగా ప్రకటించింది. సన్నీ అయిష్టంగానే అపాజీ బైక్ ఇచ్చి ఫోజులు ఇచ్చాడు.