మంగళూరు సోయగం దీపికా పడుకోన్ దక్షిణాది సినిమాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ’ చిత్రంలో నాయికగా నటిస్తున్న ఈ భామ త్వరలో ఓ తమిళ చిత్రంలో భాగం కాబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే… అగ్ర నటుడు కమల్హాసన్ నిర్మించబోతున్న భారీ పీరియాడిక్ చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకుడు. ఈ చిత్రంలో శింబు హీరో, విలన్గా ద్విపాత్రాభినయం చేయబోతున్నారని చెబుతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో దీపికా పడుకోన్ కథానాయికగా నటించనుందనే వార్తలొస్తున్నాయి. కథలోని కొత్తదనం నచ్చడంతో దీపికా పడుకోన్ ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఉందని అంటున్నారు. మరో నాయికగా కీర్తి సురేష్ నటించనుందని తెలుస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత దీపికా పడుకోన్ తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమా ఫస్ట్లుక్, టైటిల్ను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయబోతున్నారు.