Sidhu Jonnalagadda | పద్నాలుగేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డకి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ‘డీజే టిల్లు’ సినిమా ధైర్యాన్నిచ్చింది. సిద్ధూజొన్నల గడ్డకు యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. గతేడాది మార్చి 12 చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది. సిద్ధూ జొన్నలగడ్డ నటన, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ యూత్నే కాదు ఫ్యామిలీ ఆడియోన్స్ను మెప్పించాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది.
ఇక ఇదిలా ఉంటే సీక్వెల్ స్టార్ట్ అవ్వకముందు నుంచే ఈ సినిమాపై ఎన్నో వివాదాలు, రూమర్స్ వినిపించాయి. ముద్దు సన్నివేశాలు మితి మీరడంతో హీరోయిన్లు సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు, మొదటి పార్టు తెరకెక్కించిన విమల్ కృష్ణతో గొడవలు రావడంతో రెండో భాగానికి కొత్త దర్శకుడిని తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా సిద్దూ వాటిపై క్లారిటీ ఇచ్చాడు. ముందు నుంచి ఈ సినిమాకు అనుపమనే అనుకున్నట్లు తెలిపాడు. ఎవరి వచ్చారని, వెళ్లారని ఏవేవో రూమర్స్ వచ్చాయని.. అందులో ఎలాంటి నిజం లేదని తెలిపాడు.
ఇక డైరెక్టర్ విమల్ కృష్ణకు, తనకు మధ్య గొడవ జరిగి ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిపోయాడని గాసిప్లు క్రియేట్ చేశారు. కానీ అందులో నిజం లేదు. టిల్లు స్క్వేర్ను చేయాలనుకున్నప్పుడు మొదట సంప్రదించింది విమల్నే. అతనేమో.. మళ్లీ అదే ప్రాజెక్టా? ఇంకేదైనా కొత్తగా చేద్దాం అన్నాడు. అలా టిల్లు స్క్వేర్లోకి మల్లిక్ వచ్చాడంటూ క్లారిటీ ఇచ్చాడు.