బాలీవుడ్లో సీక్రెట్ ప్రేమాయణాలు చాలా ఎక్కువే. ఎప్పుడు ఎవరు ఎలా ప్రేమలో పడతారో చెప్పడం కష్టమే. చాలా మంది జంటలు కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి,ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు. కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ- హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
రీల్ లైఫ్లో బెస్ట్ జోడీ అనిపించుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ జంట నిజ జీవితంలోనూ ఒక్కటి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.అయితే వీరిద్దరు తరచు విహార యాత్రలకు వెళ్లడం, పార్టీలకు అటెండ్ అవుతుండడం చూస్తుంటే త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా తన పెళ్లి విషయమై ఓపెన్ అయ్యారు. ”పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, నేను జ్యోతిష్యుడిని కాదు. లైఫ్లో అది చాలా ముఖ్యమైన అంశం. పెళ్లి సెట్ అయితే అందరికి చెబుతాను. దానికి టైం రావాలి అని ఆయన పేర్కొన్నారు. కాగా, కియారా- సిద్దార్థ్ కాంబోలో వచ్చిన ‘షేర్షా చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.