Dj Tillu Sequel Launched | సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డీజే టిల్లు’. మార్చ్ 12న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది. ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తింపు కోసం ఎదురు చేస్తున్న సిద్ధూకు ఈ చిత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ముఖ్యంగా యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలంగాణ యాసలో సిద్దూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేశాయి. దానికి తోడు నేహా శెట్టి అందాల ఆరబోత సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని మేకర్స్ సక్సెస్ మీట్లోనే చెప్పారు. కాగా ప్రస్తుతం సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరపడింది. డీజే టిల్లు మళ్ళి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక తాజాగా ఆ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను నేడు ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుందని సమాచారం. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించాడు. ప్రస్తుతం సిద్ధూ రెండు ప్రాజెక్ట్లకు సైన్ చేశాడట.
The most awaited Franchise… Gearing up for Round 2 🔥
Crazy adventure starts filming in August! 🤩 pic.twitter.com/JX130Z4fpZ
— Naga Vamsi (@vamsi84) June 25, 2022