అగ్ర కథానాయిక శృతిహాసన్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. సంక్రాంతి సీజన్లో వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మంచి విజయాలను దక్కించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా ఇంగ్లీష్ చిత్రం ‘ది ఐ’. డాఫేష్మోన్ దర్శకత్వం వహించారు. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో నామినేట్ అయిన ఈ చిత్రం తన కెరీర్లోనే ప్రత్యేకమని చెబుతున్నది శృతిహాసన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమా గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్క్రీనింగ్స్లో దర్శకత్వం, సినిమాటోగ్రఫీ విభాగాల్లో నామినేట్ అయింది.
లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు దక్కించుకుంది. కోర్ఫ అనే దీవుల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. 1980 దశకంలో కథ నడుస్తుంది’ అని చెప్పింది. భర్త మరణించిన ద్వీపానికి అతని చితాభస్మంకోసం వెళ్లిన యువ వితంతువు కథ ఇది. సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదిలావుండగా ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించిన ‘సలార్’ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలో కూడా ఈ భామ కీలకమైన పాత్రను పోషిస్తున్నది.