నటనతో పాటు సంగీతంలోనూ ప్రజ్ఞ చూపించే శృతి సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటుంది. అందమైన పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన ‘ఎడ్జ్’ ఆల్బమ్ అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చింది. ‘హమ్ హిందూస్థానీ’ అనే మ్యూజిక్ వీడియో చేసి తన ప్రతిభను చూపించిందీ తార. తనకున్న మ్యూజిక్ టాలెంట్ గురించి శృతిహాసన్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. మాటల్లో వివరించలేని కొన్ని భావాలను పాట ద్వారా చెప్పడం సాధ్యమవుతున్నదని ఆమె అంది.
శృతి హాసన్ మాట్లాడుతూ…‘సంగీతం నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. నా అనుభూతులన్నీ పాట ద్వారా చెప్పగలుగుతున్నా. సెలబ్రిటీ జీవితాన్ని వదిలేస్తే వ్యక్తిగతంగా మన అస్తిత్వం ముఖ్యమని నమ్ముతాను. జీవితంలో ఎప్పుడూ మరొకరి నీడగా ఉండకూడదన్నది నా అభిప్రాయం. అందుకే నటిగా, గాయనిగా నేనెప్పుడు ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను’ అని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో శృతి హాసన్ ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ ‘సలార్’ చిత్రాల్లో నటిస్తున్నది.