టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించిన శ్రియ 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రియ ఈ మధ్య గమనం, ఆర్ఆర్ఆర్ చిత్రాలలో కీలక పాత్ర పోషించింది. ఇందులో శ్రియ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తుంది. అయితే శ్రియ 2020 లాక్డౌన్ సమయంలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. ఆ విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టారు. రీసెంట్గా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
2020 లాక్డౌన్ సమయంలో ప్రపంచమంతా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. చాలామంది ఎంతో బాధపడ్డారు. కానీ, అదే లాక్డౌన్ కాలం మా జీవితంలో సరికొత్త రంగుల్ని నింపింది. సంతోషాన్ని అందించింది. మా ఏంజెల్ రాకతో అద్భుతం జరిగింది’ అని తెలిపారు. అయితే తన కుమార్తెకు రాధ అని నామకరణం చేసినట్లు శ్రియ వెల్లడించింది. రాధ అని పేరు పెట్టడంపై తన భర్త కూడా ఎంతో సంతోషించాడని శ్రియ తెలిపింది. రానున్న రోజులలో రాధ పిక్స్ ఒక్కొక్కటిగా శ్రియ వదలనున్నట్టు తెలుస్తుంది.