గుంటూరుజిల్లా తెనాలిలో పుట్టిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ.. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటిగా సత్తా చాటుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమాలతోపాటు వెబ్ సిరీస్తో కూడా ఆమె బిజీబిజీ. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్పై కన్నేసింది ఈ అందాలభామ. ప్రస్తుతం ఆమె ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నది.
సినిమా పేరు ‘మంకీ మ్యాన్’. దేవ్ పటేల్ దర్శకుడు. ఇందులో శోభిత ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇటీవల మీడియాతో తన పాత్ర గురించి శోభిత మాట్లాడింది. ‘ఇదో భావోద్వేగపూరితమైన కథ. ఇందులో నటించడంచేత సినిమాపై మరింత గౌరవం పెరిగింది. ఇప్పటివరకూ నా కెరీర్లో ఇలాంటి పాత్ర చేయలేదు. నాకెంతో స్ఫూర్తినిచ్చిన పాత్ర ఇది. ఛాలెంజ్తో కూడిన పాత్రలు చేయడానికి నేను భయపడను.
అందుకే ఈ పాత్రను ఓ అవకాశంగా తీసుకున్నాను’ అని చెప్పింది శోభిత. ఇంకా మాట్లాడుతూ ‘ కథ కొత్తగా ఉంటే భాషతో సంబంధం లేదు. ఏ భాషలోనైనా నటిస్తా. ప్రస్తుతం కొత్త కథలపై, కొత్త పాత్రలపై దృష్టిపెట్టాను. అందులో భాగమే ‘మంకీ మ్యాన్’. ఈ సినిమా చిత్రీకరణ విషయంలో దర్శకుడు దేవ్ పటేల్ ప్రతిభను అభినందించకుండా ఉండలేం. హనుమంతుడి స్పూర్తిగా పేదలను కాపాడుతూ ముందుకెళ్లే ఓ యువకుడి కథగా ‘మంకీ మ్యాన్’ని ఆయన తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. భూమిపై ఉన్న ప్రతి వ్యక్తీ ఇష్టపడేంత గొప్ప కథ ఇది’ అని నమ్మకంగా చెప్పింది శోభిత ధూళిపాళ.