సినిమా ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ అప్పట్లో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుశాంత్ మరణించిన సమయంతో దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. నెపోటిజం బాగా ఉందంటూ దుమ్మెత్తిపోసారు. అయినప్పటికీ స్టార్ ఫ్యామిలీల నుండి వారసుల పరిచయం ఎక్కడా తగ్గట్లేదు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్ కుటుంబాల నుంచి ఇప్పటికే చాలామంది హీరోలుగా పరిచయం అయ్యారు. సూపర్స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మహేష్ బాబు, సీనియర్ నరేష్, రమేష్ బాబు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అతనే శరణ్ కుమార్.శివ కేశర కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాతో ఆయన వెండితెరకు పరిచయం కానున్నారు.
శనివారం శరణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండిఫస్ట్ గ్లింప్స్ని కృష్ణ విడుదల చేశారు. ఇది సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా శరణ్కు మంచి బ్రేక్ ఇస్తుంది అని ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నారు.