బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం మంగళవారం ఎపిసోడ్లో షణ్ముఖ్- శ్రీరామ్ మధ్య డిస్కషన్ కంటిన్యూ అయింది. జస్వంత్ని వంట చేసుకోవాలని శ్రీరామ్ అనడంతో ఆయనకు సపోర్ట్గా ఉంటున్న షణ్ముఖ్, సిరి నానా రచ్చ చేశారు. ఫుడ్ తినడం కూడా మానేసి కూర్చుంటే శ్రీరామ్ వాళ్ల దగ్గరకు వెళ్లి మీరు తినకపోతే నేనూ తిననంటూ స్వయంగా తానే ఫుడ్ తెచ్చి షణ్ముఖ్, జెస్సీలకు తినిపించాడు.
నువ్వు ఎవడో తిండిపెట్టనన్నాడంట అని అడిగిన విధానం నాకు నచ్చలేదు అని శ్రీరామ్.. షణ్ముఖ్ని అడిగాడు. నువ్వు అసలు ఏం వినకుండా ఎందుకు అరుస్తున్నావు అంటే, దానికి షణ్ను నాకు జెస్సీ అదే చెప్పాడు. నా ఫ్రెండ్ కాబట్టే వాడి స్టాండ్ తీసుకున్నా. నా రూల్ బుక్లో విన్నదే మాట్లాడాలని లేదు అని చెప్పాడు షణ్ముఖ్. రూల్లో లేదంటే కాదు.. నేర్చుకో జీవితంలో పనికి వస్తుంది’ అని చురక వేశాడు శ్రీరామ్.
26 ఏళ్లకే ఏదీ అవసరం రాదని అనుకోకు అని శ్రీరామ్ అనడంతో పక్కనే ఉన్న సిరి సర్రున లేచింది. మళ్లీ ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్.. మోజో రూంలో కూర్చుని మాట్లాడుతున్నావ్ అని అనడానికి నువ్ ఎవరు? అని చెలరేగిపోయింది సిరి. శ్రీరామ్ అన్న చిన్నమాటని ఎందుకు ఇంతపెద్దది చేస్తున్నారని ప్రియాంక.. ప్రియతో మాట్లాడింది. అయితే అన్నంపై అలిగిన షణ్ముఖ్ గ్యాంగ్ అలానే పడుకున్నారు.వారు తినలేదని శ్రీరామ్, హమీదా కూడా కడుపు మాడ్చుకున్నారు. ఉదయాన్నే సిరి, జెస్సీ, షణ్ముఖ్లు తింటూ కనిపించారు.