Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, ప్రముఖ నటి ఆలియా భట్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు అటు బీ టౌన్తో పాటు ఇటు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి.
ఇందులో షాహిద్ కపూర్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనుండగా, ఆలియా భట్ కీలకమైన పాత్రలో ఎన్టీఆర్ సరసన నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మరియు టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, యువ సుధా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.