సల్మాన్ఖాన్, కత్రినాకైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్-3’. ఈ సినిమాలో షారుఖ్ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సక్సెస్ఫుల్ ఫ్రాంఛైజీ టైగర్, టైగర్ జిందాహై సిరీస్లో మూడో సినిమాగా ‘టైగర్-3’ని తెరకెక్కించారు. నవంబర్ 12న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది. దర్శకుడు మనీష్శర్మ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమా టీజర్, ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది.
యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా ఉన్నాయని అంటున్నారు. అయితే ట్రైలర్లో చూసింది కేవలం ఒక్క శాతం యాక్షన్ మాత్రమే. దాదాపు 50 శాతం భారీ పోరాట ఘట్టాలుంటాయి. ప్రేక్షకులకు ఓ యాక్షన్ ఫీస్ట్లా అనిపిస్తుంది. వెండితెరపై సరికొత్త లోకాన్ని చూస్తున్న అనుభూతికిలోనవుతారు. రియల్ హీరోయిజంతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని చెప్పారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా ‘టైగర్-3’ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.