ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇటీవల స్ట్రీమింగ్ మొదలైన ఈ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో నిర్మాత మహీ వి రాఘవ్ మాట్లాడుతూ…‘ఒక మంచి సిరీస్ చేశామనే సంతృప్తి ఉంది.
ఇందులోని వినోదాత్మక సన్నివేశాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ సిరీస్కు సీక్వెల్ ఎప్పుడు చేస్తున్నారని వారు అడుగుతున్నారు. త్వరలోనే ఆ వర్క్ మొదలుపెడతాం. ‘సైతాన్’ అనే మరో వెబ్ సిరీస్కు ప్లాన్ చేస్తున్నాం. అదొక ప్రత్యేకమైన కథగా ఆకట్టుకుంటుంది. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ అనే సినిమా కూడా పూర్తి చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ‘యాత్ర 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది’ అని చెప్పారు.