ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్గా మారిన హీరోయిన్స్లో పూజా హెగ్డే ఒకరు. గోల్డెన్ లెగ్ అనే ట్యాగేసుకుని వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న ఈ భామ అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతోనూ కుర్రాళ్లని వేటాడుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ రాధేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మహేష్-త్రివిక్రమ్ చిత్రం,విజయ్ బీస్ట్తో పాటు రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫొటో షూట్స్తోను తెగ రచ్చ చేస్తుంటుంది పూజా. ఇటీవల పూజా షేర్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్ని అలరించాయి. అయితే ఈ అమ్మడిపై ప్రముఖ నటి వైఎస్సార్సిపి ఎమ్యెల్యే రోజా భర్త సెల్వమణి ఒక ఇంటర్వ్యూ లో పలు విమర్శలు చేసారు. కెరీర్ మొదట్లో ఒక వ్యక్తితో సెట్కి వచ్చేది. ఇప్పుడు ఎక్కువగా ఛాన్స్లు రావడంతో షూటింగ్ లొకేషన్స్కి తన టీమ్ 12 మందిని తోడుగా వెంట తీసుకువస్తుందని అన్నాడు.
పూజా తనతో పాటు అంతమందిని తీసుకొస్తే ప్రొడ్యూసర్స్ ..వారందరి ఖర్చులు భరించవలసి పరిస్థితులు తలెత్తుతున్నాయని,ఈ విధంగా నిర్మాతలపై ఆమె అలా భారం వేడయం ఎంత వరకు కరెక్ట్ అంటూ విమర్శలుగుప్పించారు. ప్రస్తుతం సెల్వమణి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై పూజా ఎలా స్పందిస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.