Sarkaru Vaari Paata | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈయన నటించిన లెటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లు జోరుగా జరుపుతుంది. ఈ చిత్రానికి పనిచేసిన క్రూ మెంబర్స్ ప్రమోషన్లలో పాల్గొంటూ, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవలే దర్శకుడు పరశురాం, కీర్తిసురేష్ కూడా ప్రమోషన్లలో పాల్గొన్నారు. మొదటి నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.
లేటెస్ట్గా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమా నిడివి 162నిమిషాలు ఉంది. మహేష్బాబుకు జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్గా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ‘కళావతి’, ‘పెన్ని’, ‘టైటిల్ ట్రాక్’, ‘మ..మ..మహేష’ పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలతో కలిసి జీఎమ్బీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై మహేష్బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.