Sapta Sagaradaache Ello (Side A) | కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty). కిరిక్ పార్టీ (Kirik Party), అతడే శ్రీమన్నారాయణ (Avane Srimannarayana), చార్లీ 777 (Charlie 777), గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) వంటి చిత్రాలతో పాన్ ఇండియా(Pan India) లెవల్లో రక్షిత్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రక్షిత్ శెట్టి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ ఏ) Sapta Sagaradaache Ello (Side A). రుక్మిణి (Rukmini) కథానాయికగా నటిస్తుంది.
గోధి బన్న సాధారణ మైకట్టు(Godhi Banna sadharana Maikattu), కవలుదారి Kavaludhari (తెలుగులో కపటధారి), భీమ సేన నల మహారాజు (Bheema Sena Nala Maharaju) లాంటి బ్లక్ బస్టర్లు తీసిన దర్శకుడు హేమంత్ రాజ్ (Hemanth Raj) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. కాగా సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ రక్షిత్ శెట్టి ఫ్యాన్స్కు మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Hyderabad, here we come! ☺️#SaptaSagaradaacheEllo @rakshitshetty @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_ @charanrajmr2701 @AdvaithaAmbara #ParamvahPictures @ParamvahStudios @kvnproductions #SSE pic.twitter.com/Jm54gw2dju
— Paramvah Studios (@ParamvahStudios) August 31, 2023
ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ ఏ) గా.. రెండో పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ బీ) గా రానుంది. ఇక హేమంత్ రాజ్, రక్షిత్ శెట్టి కాంబోలో ఇంతకుముందు గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కన్నడలో బ్లక్ బస్టర్గా నిలిచింది. కాగా సుమారు 8 ఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సప్త సాగరే దాచే ఎల్లోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రక్షిత్ శెట్టి సొంత ప్రొడక్షన్స్ అయిన పరమవా స్టూడియోస్ (Paramvah Studios) బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వసంత్, చైత్ర జె ఆచార్, అచ్యుత్ కుమార్, శరత్ లోహితాశ్వ, పవిత్ర లోకేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. చరణ్ రాజ్ సంగీతం అందించనున్నారు.
ఇక ఇదే కాకుండా రక్షిత్ శెట్టి సొంత డైరెక్షన్లో ‘రిచర్డ్ ఆంటోనీ’(Richard Antony) అనే సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్, కాంతారలాంటి సినిమాలను నిర్మించిన ‘హోంబాలే ఫిల్మ్స్'(Hombale Films) సంస్థ నిర్మిస్తుంది.