Shaakuntalam Movie | పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. తొలి సినిమానే తిగరులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఇక గతేడాది సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్లు తెలిపి అందరిని షాక్కు గురిచేసింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటుంది. ఇక ఏడెమినిది నెలలుగా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన ‘సామ్ సిటాడెల్’ వెబ్ సిరీస్తో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం సామ్ నటించిన ‘శాకుంతలం’ రిలీజ్కు సిద్ధంగా ఉంది.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా గడుతుపుతున్నారు. సమంత కూడా మీడియాకు పలు ఇంటర్వూలు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా సామ్ ముందుగా ఈ సినిమా చేయనని గుణశేఖర్కు చెప్పిందట. శకుంతలలా తనలో తేజస్సు, ఠీవీ కనిపించవని భావించినట్లు తెలిపింది. అందుకే మొదటి ఈ సినిమాను చేయనని గుణశేఖర్కు చెప్పినట్లు సామ్ వెల్లడించింది. అయితే తను ఏదైనా పాత్ర విషయంలో భయపడితే కచ్చితంగా ఆ పాత్ర చేయాల్సిందేనని డిసైడవుతానని, అందుకే ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చింది.
మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో సమంత శకుంతలగా నటించింది. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.