రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న యాభయ్యవ చిత్రమిది కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్రాజు. భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ సినిమా జూలై లేదా ఆగస్ట్ ప్రథమార్థంలో సెట్స్పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని కీలకమైన పాత్రకోసం దర్శకుడు శంకర్..బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ను సంప్రదించారని చెబుతున్నారు. కథలోని సామాజికాంశాలు, తన పాత్ర చిత్రణ నచ్చడంతో సల్మాన్ సినిమాకు ఓకే చెప్పారని సమాచారం. కథాగమనంలో సల్మాన్ఖాన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ఖాన్ నెలరోజుల పాటు డేట్స్ కేటాయించారని తెలిసింది. అయితే ఈ విషయంలో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక సమాచారం రావాల్సిందేనంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించబోతున్నారు.