సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్నది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 90 దశకంలోని ఓ గ్రామ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అంతు చిక్కని సమస్యలతో బాధపడుతున్న గ్రామ ప్రజలను కథానాయకుడు ఎలా కాపాడాడు అనేది ఆసక్తికరంగా ఉండనుంది. మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతున్నది.