క్రికెట్లో ఐపీఎల్ సీజన్ ప్రత్యేకమనే చెప్పాలి. ఈ పొట్టి క్రికెట్ వీక్షకులని ఎంతగా అలరిస్తుంది. ఐపీఎల్లో బంతిని స్టాండ్స్కి తరలించే పనిలో బ్యాట్స్మెన్లు బిజీగా ఉంటుంటారు.ఇది చూసి క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆనందిస్తుంటారు. అయితే ఐపీఎల్లో ఫేవరేట్ టీం అంటే చెన్నై సూపర్ కింగ్స్ లేదా ముంబై ఇండియన్స్ ఠక్కున గుర్తొస్తాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్కి చాలా ఆదరణ ఉంటుంది.
ధోని సారథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై టీం మరికొద్ది రోజులలో జరగనున్న సెకండ్ షెడ్యూల్లో వరుస విజయాలు సాధించి కప్ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే చెన్నై టీం రీసెంట్గా తమ టీం లోని ముగ్గురు ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, రైనా లు కలిసి ఉన్న ఒక పిక్ పెట్టి వీరే మా “ఆర్ఆర్ఆర్ ” అంటూ క్రేజీ ట్వీట్ పెట్టారు. దీనికి స్పందించిన ఆర్ఆర్ఆర్ టీం.. ఈ ముగ్గురు ‘ఆర్’ ల ఆటని చూడటానికి విజిల్ పట్టి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నామని రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం ట్విట్టర్ సంభాషణ వైరల్గా మారింది. ఐపీఎల్ మళ్ళీ ఈ సెప్టెంబర్ 19 నుంచి రీస్టార్ట్ కానుండగా , రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్,అలియా భట్,ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుంది.