Rowdy boys movie on OTT | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకటి. దిల్రాజు, శిరీష్లు ఈ సంస్థకు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటి అన్నట్లు అయిపోయింది. దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ను కూడా ఒక రేంజ్లో చేస్తాడు. అలాంటిది ఆ సంస్థ నుంచే హీరో రాబోతున్నాడు అంటే దిల్రాజు ఎలాంటి కథతో వస్తాడు అని ప్రేక్షకులలో ఉత్సుకత మొదలైంది. అలా శిరీష్ తనయుడు ఆశిశ్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ‘రౌడి బాయ్స్’ సినిమాను దిల్రాజు తెరకెక్కించాడు.
‘హుషారు’ ఫేం శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. పోటీగా ‘బంగార్రాజు’ సినిమా ఉండటం, ఫ్యామిలీ ఆడియెన్స్ బంగార్రాజు సినిమాకు ఓటేయడంతో రౌడిబాయ్స్ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డేట్ కన్ఫార్మ్ అయింది.రౌడి బాయ్స్ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 లో మార్చి11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.