బాలీవుడ్లో చక్కటి అవకాశాల్ని అందుకుంటున్నా మిల్కీబ్యూటీ తమన్నాకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అక్షయ్కుమార్, అజయ్దేవ్గణ్ వంటి అగ్రహీరోలతో హిందీలో సినిమాలు చేసినా తమన్నా విజయాల్ని మాత్రం అందుకోలేదు. తాజాగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్రంతో బాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది తమన్నా. రితేష్ దేశ్ముఖ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంకఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వివాహమనేది తనకు తప్ప అందరికీ అవసరమని విశ్వసించే మ్యారేజ్బ్యూరో అధినేతగా తమన్నా ఈ సినిమాలో కనిపించబోతున్నది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆమె కనిపిస్తుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమాతో రితేష్ దేశ్ముఖ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెట్ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది.