న్యూఢిల్లీ: వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ .. రాధికా మర్చెంట్ను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. గుజరాత్లోని జామ్నగర్లో పెళ్లి వేడుక జరగనున్నది. అయితే ఇవాళ జరగనున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పాప్ సింగర్ రిహాన్నా పర్ఫార్మ్ చేయనున్నది. తన పర్ఫార్మెన్స్ కోసం రిహాన్నా.. సుమారు 9 మిలియన్ల డాలర్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఆ సింగర్ దాదాపు 75 కోట్లు వసూల్ చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్ల్యాండ్ టైటిల్తో ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నారు.
పాప్ సింగర్ రిహాన్నా.. ఫిబ్రవరి 29వ తేదీన జామ్నగర్కి వచ్చేసింది. తమ ట్రూప్తో ఆమె ఈవెంట్ ప్రదేశంలో దిగింది. తన ఆల్బమ్లోని హిట్ సాంగ్స్ను రిహాన్నా పాడే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీని కోసం ఆమె భారీ సెట్ వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టేజ్ ఎక్విప్మెంట్, డ్రెస్సులు, బ్యాక్గ్రౌండ్ సింగర్లకే ఎక్కువ ఖర్చు అవుతోంది.
రిహాన్నా తన చివరి పర్ఫార్మెన్స్ను 2023 సూపర్ బౌల్ ఈవెంట్లో చేసింది. ఆ షోను 121 మిలియన్ల మంది వీక్షించార. అంబానీ ఇంట జరుగుతున్న వెడ్డింగ్లో పాల్గొనున్న రెండవ అంతర్జాతీయ మ్యూజిక్ ఆర్టిస్టుగా కూడా ఆమె నిలుస్తోంది. 2018లో ఈషా అంబానీ, ఆనంద్ పిరామల్ సంగీత్ సమయంలో.. పాప్ స్టార్ బియాన్సీ పర్ఫార్మ్ చేసింది. ఆమెకు అప్పట్లో 33 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు.
ఇవాళ జరిగే ఈవెంట్లో సింగర్ రిహాన్నాతో పాటు దిల్జిత్ దోసంజ్ కూడా స్టేజ్ షో ఇవ్వనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇల్యూజనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ కూడా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పర్ఫార్మె చేయనున్నారు. బాలీవుడ్ స్టార్స్ షారూక్, దీపికా, రణ్వీర్, ఆలియా, రణ్బీర్, అర్జున్ కపూర్ కూడా హాజరుకానున్నారు.