తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్సీసీ అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ కార్యక్రమాన్ని ఆగస్టు 12న దుబాయ్లో నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ అవార్డ్స్ బ్రోచర్ను హైదరాబాద్ ఫిలించాంబర్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్కే గౌడ్ మాట్లాడుతూ…‘దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తారని ఆశిస్తున్నాం. గత రెండేండ్లలో విడుదలైన చిత్రాలు ఈ పురస్కారాల కోసం ఎంట్రీలు పంపవచ్చు. ఏటా దుబాయ్లోనే ఈ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అలీ, నిర్మాత ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.