రవితేజ కథానాయకుడిగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్లో పోలెండ్లో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. ప్రతీకార నేపథ్య యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ చిత్రం ‘జాన్విక్’ ఆధారంగా కథను తయారుచేసుకున్నారని సమాచారం. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనుందని తెలిసింది. ఇటీవల విడుదలైన ‘కార్తికేయ-2’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది.