Raththam Trailer | బిచ్చగాడు (Bichagadu) సినిమాతో సూపర్ ఫేం సంపాదించాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony). అయన నటించిన తాజా చిత్రం రత్తం (Raththam). ఈ చిత్రాన్ని డేట్స్ ఖాళీ లేకపోవడంతో మొదట నవంబర్, లేదా డిసెంబర్లో విడుదల చేద్దామనుకుంది చిత్రబృందం. కానీ ప్రభాస్ సలార్ (Prabhas Salaar) విడుదల తేదీ వాయిదా పడడంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయలి అనుకున్నారు. అయితే ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోని (Meera Antony) ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో రత్తం మూవీ సెప్టెంబర్ 28న విడుదలను వాయిదా వేసుకుంది. తాజాగా ఈ మూవీ అక్టోబర్ 06న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ దర్శకుడు సీఎస్ అముధన్ ఒక సంచలన ప్రకటన చేశాడు.
రత్తం మూవీ నేడు విడుదల కానుండగా. ఈ మూవీ చూడటానికి వచ్చే ప్రేక్షకులకు దర్శకుడు సీఎస్ అముధన్ ఒక సలహా ఇచ్చాడు. ఈ సినిమాను ఎంటర్టైన్గా చూడలంటే తాను మొదట తీసిన తమిళ పడం 1, 2 పార్ట్ (Thamizh Padam) సినిమాలను చూడవద్దని అప్పుడే ఈ సినిమాను ఎంజాయ్ చేయగలరని సీఎస్ అముధన్ తెలిపాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
Dir @csamudhan says don’t watch #TamilPadam 1&2 !!#Raththam #ரத்தம்#RaththamFromTomorrow pic.twitter.com/h4TjPyCZO4
— Sreedhar Pillai (@sri50) October 5, 2023
ఇదిలా ఉండగా.. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. చెన్నైలో విధ్వంసం సృష్టించే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ దారుణ హత్యలు వల్ల రాష్ట్ర మంత్రులు రాజీనామాకు దారితీసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఈ సినిమా ట్రైలర్లో చూడవచ్చు. ఇక మీడియా, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న అనుబంధం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మిగిలిన కథ.
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రల్లో కనిపించగా.. మహిమా నంబియార్, రమ్య నంబిసన్, ఉదయ్ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.