కన్నడ సోయగం రష్మిక మందన్నా శాండిల్వుడ్లో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ‘కిర్రాక్ పార్టీ’తో హీరోయిన్గా పరిచయం అయిన విషయం తెలిసిందే. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో పాటు గ్లామర్తో ఆకట్టుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. ఈ క్రమంలోనే ‘ఛలో’ అనే సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో రష్మిక నటించిన తొలి చిత్రానికి మంచి మార్కులు పడడంతో వరుస ఆఫర్స్ దక్కించుకుంది.గీత గోవిందం, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తమిళంతో పాటు హిందీ భాషలలోను వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. పుష్పలో కథానాయికగా నటిస్తున్న రష్మిక.. శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు ‘మిషన్ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్తో కలిసి ‘గుడ్బై’ అనే సినిమాలోనూ నటిస్తోంది.
మరోవైపు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలకు సైన్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తున్న రష్మిక తన ఫాలోవర్స్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి గానూ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపికైంది రష్మిక. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో రష్మిక ఇండియా మొత్తం చక్కర్లు కొడుతుంది. తాజాగా ఎయిర్ పోర్ట్లో కిల్లింగ్ లుక్తో కనిపించింది రష్మిక. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తున్న రష్మికని చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.