ముంబై: న్యూడ్ ఫోటో షూట్ ఘటనలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్పై ముంబైలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనకు చెందిన ఫోటోల్లో కొన్నింటిని ట్యాంపర్ చేసి, మార్పింగ్ చేసినట్లు నటుడు రణ్వీర్ ఆరోపించారు. ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రణ్వీర్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళల మనోభావాలను కించపరిచినందుకు ఆ కేసును పెట్టారు.
ఐపీసీలోని 509, 292, 294 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67ఏ కింద రణ్వీర్పై కేసు బుక్ చేశారు. చెంబూరు పోలీసు స్టేషన్లో రణ్వీర్పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఓ ఎన్జీవోకు చెందిన ఆఫీసు బేరర్ చెంబూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు అందజేశాడు. మ్యాగ్జిన్ కోసం రణ్వీర్ నగ్న ఫోటోషూట్లో పాల్గొన్నాడు. ఆ కేసులో జరిగిన విచారణ సమయంలో తన ఫోటో మార్ఫింగ్కు గురైనట్లు రణ్వీర్ వెల్లడించాడు.