Jani Master | లైంగిక వేధింపుల ఆరోపణల్లో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పోలీసులు కోరారు. పోక్సో కేసు కావడంతో కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
జానీ పిటిషన్పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో జానీని కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. లైంగిక వేధింపులు, పోక్సో కేసుతో జానీ మాస్టర్ పరారీలో ఉండగా.. ఈ నెల 19న సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో అరెస్టు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్కు తరలించి.. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్ని విధించింది.