Ram Gopal Varma | నాలుగేళ్ల క్రితం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఆర్జీవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నికల ఓటమి తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఎలా మారింది. ఆయన జీవితంలోకి పార్వతి ఎలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కాంట్రవర్సీయల్ సబ్జెక్ట్తో పెద్ద దుమారమే రేపాడు. ఈ సినిమా రిలీజ్ టైమ్లో ఏపిలోని చాలా చోట్ల ఈ మూవీ ప్రదర్శననే నిలిపివేశారు. ఇక ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ మరో కాంట్రవర్సీయల్ సినిమా తీసి చాలా మందికి టార్గెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు సినిమాలతో ఏపీ పాలిటిక్స్లో హీట్ పెంచడానికి వస్తున్నాడు.
తొలిపార్టులో YSR మరణం తర్వాత ఏం జరిగిందని, రెండో పార్ట్లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనే కాన్సెప్ట్తో రామ్గోపాల్ వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన వ్యూహం టీజర్కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు విమర్శలు కూడా తలెత్తాయి. ఇక శపథం సినిమా అప్డేట్లు వ్యూహం రిలీజ్ తర్వాత ఇవ్వబోతున్నారట. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్గోపాల్ వర్మ ఈ రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లను ప్రకటించాడు. తొలిపార్టు వ్యూహంను నవంబర్ 10న రిలీజ్ చేస్తుండగా.. రెండో పార్టు శపథంను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
రెండున్నర నెలల గ్యాప్లో రెండు సినిమాలు రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలు ఏపి పాలిటిక్స్ కంటే ముందే రిలీజ్ కాబోతున్నాయి. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
— Ram Gopal Varma (@RGVzoomin) October 11, 2023