గత రెండేళ్లుగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉంటున్నది పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్. ‘కొండపొలం’ తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలో నటించలేదు. తమిళంలో మాత్రం ఆయలాన్, ఇండియన్-2 వంటి భారీ సినిమాల్లో నటిస్తున్నది. కొన్నేళ్లుగా హిందీ ఇండస్ట్రీ మీద ఎక్కువ దృష్టిపెడుతున్న ఈ భామ భవిష్యత్తులో తన ప్రాధాన్యతలను మార్చుకోబోతున్నానని చెప్పింది. ప్రస్తుతం కెరీర్ను విశ్లేషించుకునే పనిలో ఉన్నానని, పాన్ ఇండియా స్థాయిలో కథాంశాలను ఎంచుకుంటానని పేర్కొంది.
ఇటీవలకాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఓకే చేశానని, ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తానని రకుల్ప్రీత్సింగ్ తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘నటిగా ఇదొక కొత్త దశగా భావిస్తున్నా. కాస్త విరామం తర్వాత మంచి కథలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. రాబోవు చిత్రాల్లో నటిగా నన్ను ఛాలెంజింగ్ రోల్స్లో చూస్తారు. వచ్చే ఏడాదిలోగా నేను నటించిన ఐదారు చిత్రాలు ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి’ అని చెప్పింది.