Rajput Payal | హిట్లు, ఫ్లాపులతో సంబంధంలేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. ప్రస్తుతం ఈయన గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్రలో నటించనున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇషాన్ సూర్య దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్100’ ఫేం రాజ్పుత్ పాయల్ హీరోయిన్గా నటించనుంది. విష్ణుకు జోడిగా స్వాతి అనే పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే తో పాటు క్రియేటీవ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. అవ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనూప్రూబెన్స్ సంగీతం అందిస్తుండగా చోటా కే నాయుడు ఛాయాగ్రహకుడిగా పనిచేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మంచు విష్ణు నటించిన గత చిత్రం ‘మోసగాళ్లు’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది.