రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన ‘దళపతి’ మూవీ ఓ క్లాసిక్గా మిగిలిపోయింది. 31 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ సినిమా తెరపైకి రాబోతున్నది. ఇటీవల మణిరత్నం రూపొందించిన చారిత్రక నేపథ్య సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రజనీ -మణి సినిమాపై ఆసక్తి ఏర్పడుతున్నది. ‘పొన్నియన్ సెల్వన్’ కథా నేపథ్యం తనకు చాలా ఇష్టమని..ఇందులో ఒక క్యారెక్టర్ ఇవ్వమని మణిరత్నంను అడిగినట్లు రజనీకాంత్ ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో చెప్పుకున్నారు. అయితే రజనీ ఇమేజ్కు ఏ చిన్న క్యారెక్టర్నూ ఆయనకు ఇవ్వలేనని మణిరత్నం సున్నితంగా తిరస్కరించారట. మణిరత్నం దర్శకత్వంలో నటించడం వల్ల నటుడిగా మెరుగయ్యాననీ చెప్పుకున్నారు రజనీకాంత్. కలిసి సినిమా చేయాలని ఇటీవల వీరిద్దరు నిర్ణయించుకున్నారు. ‘పొన్నియన్ సెల్వన్ 2’ పూర్తవగానే రజనీ – మణిరత్నం సినిమా సన్నాహాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు.