అగ్రహీరో రజనీకాంత్ తనయ ఐశ్వర్య ఆర్ ధనుష్ దర్శకురాలిగా తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతున్నది. ఆమె నిర్దేశకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ స్ట్రెయిట్ తెలుగు సినిమాను నిర్మించబోతున్నది. సుభాస్కరన్, మహవీర్ జైన్ నిర్మాతలు. భర్త ధనుష్ హీరోగా నటించిన ‘త్రీ’ సినిమాతో డైరెక్టర్గా అరంగేట్రం చేసిన ఐశ్వర్య ప్రతిభను చాటుకుంది. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందిస్తున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు.