అద్భుతమైన సాహిత్యంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం లంగ్ క్యాన్సర్తో కన్నుమూసారు. ఆయన మృతి సాహితి లోకానికి పెద్ద లోటు అని ప్రముఖులు చెబుతున్నారు. మూడు దశాబ్ధాలుగా తన కలంతో ప్రేక్షకులని రంజింపజేసిన సిరివెన్నెల ఇలా మనందరిని విడిచివెళ్లడం తీరని శోకాన్ని మిగిలిస్తుంది. భౌతికంగా సిరివెన్నెల మనకు దూరమైన ఆయన పదాలు చిరస్థాయిగా ఉంటాయని చిరంజీవి అన్నారు.
కొద్దిసేపటి క్రితమే సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించారు.తనికెళ్ల భరణి వటవృక్షం కూలిపోయిందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. వెంకటేష్ కూడా సిరివెన్నెలకి నివాళులు అర్పించారు. నేడు ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
సిరివెన్నెల అస్తమించడంతో సినీ ప్రపంచం మూగబోయింది. కవిత్వానికి ఒంపులు అక్షరంలో అందాలు గుర్తించిన ఆయనకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఉత్తమ గీత రచయితగా 11సార్లు నంది అవార్డు అందుకున్నారు. సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట విధాత తలపున..ఈ పాటతో ఆయనకు అవార్డుల రాక మొదలైంది.