ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. సెకండ్వేవ్ కారణంగా నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా సంక్రాంతి విడుదలకు నిర్ణయం తీసుకున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రభాస్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించాం. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తాం. 1980 దశకం నేపథ్యంలో యూరప్ వేదికగా నడిచే పీరియాడికల్ ప్రేమకథా చిత్రమిది’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్పరమహంస, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, దర్శకుడు: రాధాకృష్ణకుమార్.