Sidhu Jonnalagadda | ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ రంగంలోకి ప్రవేశించి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తన రాతను తనే రాసుకోవాలని డిసైడ్ అయ్యి గుంటూరు టాకీస్ సినిమాలో నటించడమే కాకుండా కథ మాటలు రాసుకున్న నటుడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈయన లేటెస్ట్గా నటించిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రానికి కూడా ఈయనే కథ మాటలు రాసుకున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార సంస్థ నిర్మించింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో సిద్ధూ జొన్నలగడ్డకు మంచి క్రేజ్ వచ్చింది.ఈయనకు ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధూతో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.
టాలీవుడ్ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సిద్ధూ జొన్నలగడ్డతో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. డిజే టిల్లులో సిద్ధూ నటనకు, యాటిట్యూడ్కు పూరి ఫిదా అయ్యాడని తెలుస్తుంది. ప్రస్తుతం పూరి లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. లైగర్తో పాటు జనగణమన సినిమా పనులను కూడా మొదలుపెట్టాడు. ఈ రెండు చిత్రాల తర్వాత సిద్దూతో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సిద్దూ డిజేటిల్లు సీక్వెల్తో పాటు మలయాళంలో సూపర్ హిట్టయిన కప్పెల రీమేక్లో నటిస్తున్నాడు.