కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించి చాలా మందికి తీరని శోకాన్ని మిగిల్చాడు. కర్ణాటక ప్రజలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో సహ తెలుగు చిత్రపరిశ్రమ, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఒక హీరోనే కాకుండా ఆయన చేసిన సమాజసేవకు వెలకట్లలేమని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
పునీత్ మరణానంతరం పునీత్ పార్దీవ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. లక్షల మంది చివరి చూపు చూశారు.ఇంకొంత మంది పునీత్ని చూసే అవకాశం దక్కించుకోలేకపోయారు. సమాధిని అయిన దర్శించుకుంటామని డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో నేటి నుండి అనుమతించనున్నారట. సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు.
మంగళవారం పునీత్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య పాల్గొన్నారు. కాగా, అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను అనుమతి ఇస్తామని తెలిపారు శివరాజ్కుమార్.