ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కె’. దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్నది. సూపర్ హీరో కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ను జరుపుకుంటున్నది. ఈ చిత్రంలో అగ్ర నటుడు కమల్హాసన్ ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. కమల్హాసన్తో దర్శకుడు నాగ్అశ్విన్ ఇప్పటికే చర్చలు జరిపారని, ఈ సినిమా కోసం కమల్హాసన్ 30 రోజుల పాటు డేట్స్ కేటాయించారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ షెడ్యూల్లో కమల్హాసన్ జాయిన్ కాబోతున్నారని తెలిసింది. నెలరోజుల పాటు జరిగే నాన్స్టాప్ షెడ్యూల్లో కమల్హాసన్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమా కోసం కమల్హాసన్కు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో కమల్హాసన్ పాత్ర గురించి అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.