సెప్టెంబర్ 5న 19 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. రెండు వారాలలో షోకు తెరపడనుంది. ప్రస్తుతం హౌజ్లో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో విన్నర్ అవుతారు అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఈ సండే కార్యక్రమం చాలా ఫన్గా సాగింది. నాగార్జున హౌజ్మేట్స్తో అస్లీ కారెక్టర్ అంటూ సినిమా పోస్టర్లతో ఇంటి సభ్యులను పోల్చమనే టాస్క్ ఇచ్చాడు.
టాస్క్లో ముందుగా సన్నీ తన గేమ్ మొదలు పెట్టాడు. సన్నీకి మహానటి పోస్టర్ వస్తే.. ఆ పోస్టర్ ప్రియాంకకు సెట్ అవుతుందని బ్యాడ్జ్ పెట్టేశాడు. డాక్టర్ వసీకరణ్ పోస్టర్ను షన్నుకి ఇచ్చింది సిరి. నీలాంబరి పోస్టర్ను సిరికి షన్ను ఇచ్చాడు. కట్టప్ప పోస్టర్ను సిరికి శ్రీరామచంద్ర ఇచ్చాడు. అర్జున్ రెడ్డి పోస్టర్ను సన్నీకి కాజల్ ఇచ్చింది. రేలంగి మామయ్య పోస్టర్ను శ్రీరామచంద్రకు మానస్ ఇచ్చాడు.
అపరిచితుడు మానస్ అంటూ ప్రియాంక బ్యాడ్జ్ పెట్టేసింది. భానుమతి హైబ్రిడ్ పిల్ల అంటూ సిరికి బ్యాడ్జ్ తొడిగేశాడు మానస్. పెద రాయుడు పోస్టర్ను షన్నుకి కాజల్ ఇచ్చింది. చిట్టిబాబు అంటూ సన్నీకి శ్రీరామచంద్ర ఇచ్చేశాడు.ఇస్మార్ట్ శంకర్ డబుల్ ధిమాక్ అంటూ మానస్కు షన్ను ఇచ్చేశాడు. సన్నీకి సీతయ్య అనే ట్యాగును ప్రియాంక ఇచ్చింది. మర్యాద రామన్న అన్ లక్కీ ఫెల్లో అంటే శ్రీరామచంద్రకు సన్నీ ఇచ్చేశాడు. అలా ఈ అస్లీ కారెక్టర్ ఆట ముగిసిన తరువాత మానస్ సేఫ్ అని నాగ్ ప్రకటించాడు.