బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది సభ్యులతో మొదలు కాగా, ప్రస్తుతం హౌజ్లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వీరిలో గట్టి పోటి ఉంది. ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఆసక్తికరంగా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ సీజన్ చివరి కెప్టెన్గా నియంత మాటే శాసనం అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ గేమ్ చివరగా షణ్ముఖ్తో పాటు ప్రియాంక, రవి నిలిచారు.
తాను ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని ఉందంటూ తనను గేమ్లో నుంచి తొలగించవద్దని కోరింది ప్రియాంక. గేమ్లో కమ్యునిటీని వాడడం ఏంటని ఫైర్ అయిన షణ్ముఖ్ తాను రవి కోసం ఇప్పటివరకు ఏమి చేయలేకపోయానని అవకాశం వచ్చింది కాబట్టి అతడిని సేవ్ చేస్తున్నానని నిర్ణయాన్ని ప్రకటించాడు షణ్ను.
అయితే తనని సేవ్ చేయని కారణంగా పింకీ చాలా బాధపడింది. తల కొట్టుకుంది. బాత్రూంకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. సన్నీకూడా ప్రియాంకకి సపోర్ట్ ఇచ్చిన ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఫైనల్గా షణ్ముఖ్, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్లో ఆఖరి కెప్టెన్గా నిలిచాడు. సిరి అందంగా కనిపించాలంటూ షణ్ను ఆమెకు ముక్కుపుడకిచ్చాడు.