బిగ్ బాస్ సీజన్5 కార్యక్రమం చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 5న 19 మంది సభ్యులతో ప్రారంభమైన బిగ్ బాస్ షోలో ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. 12వ వారం రవి రూపంలో ఊహించని ఎలిమినేషన్ జరిగింది. అయితే ఈ షోలో గెలిచిన వారికి ప్రతి సారి 50 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తుంటారు. కాని ఈసారి బిగ్బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్నగర్లోని సువర్ణ కుటీర్లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు నాగ్.
వచ్చిన ప్రైజ్ మనీతో ఎవరెవరు ఏం చేస్తారు చెప్పమని నాగార్జున అడగగా, ముందుగా ప్రియాంక కొడుకుగా, తన తల్లిదండ్రులకు ఓ ఇళ్లు కట్టిస్తాను. అమ్మా అని పిలిపించుకోవడం ఇష్టం, అందుకోసం అమ్మాయిని దత్తత తీసుకుంటాను. 1996నుంచి బోయినపల్లిలో ఇంట్లోనే ఉంటున్నాం.. ఒకవేళ ఈ అమౌంట్ గెలిస్తే.. అమ్మానాన్నలతో కలిసి కొత్తింటికి షిఫ్ట్ అవుతామని అని చెప్పుకొచ్చింది ప్రియాంక.
ఇక రవి మాట్లాడుతూ.. వియా చదువు కోసం కొంత డబ్బు సేవ్ చేస్తానని, మిగిలిన డబ్బుతో ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభిస్తాను అని అన్నాడు. మాకు ఓ ముప్పై లక్షలు అప్పు ఉంది.. ఆ డబ్బును కట్టేస్తాను అని కాజల్ తెలిపింది. సువర్ణభూమి వాళ్లు ఇచ్చే ఫ్లాట్లొ ఇళ్లు కట్టుకుంటాను అని కాజల్ తెలిపింది. అమ్మకు కొంత డబ్బిస్తాను.. సెలూన్ బ్యూటీ ఇండస్ట్రీ బిజినెస్ చేస్తాను.. అది నా డ్రీమ్ అంటూ సన్నీ చెప్పుకొచ్చాడు.