బిగ్ బాస్ హౌజ్కి కెప్టెన్ పోటీ దారులని ఎంపిక చేసుకునే క్రమంలో యాంకర్ రవి తన టీం నుంచి ఆనీ, హమీదా, శ్వేతా లని ఎంచుకున్నాడు. అయితే ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోయిన ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. ఇందులో గెలిస్తే అందరిలాగే కెప్టెన్గా పోటీ చేస్తే అర్హత తిరిగి లభిస్తుందని అన్నాడు.
అయితే ప్రియాంక కోసం యాంకర్ రవి.. నేను త్యాగం చేస్తానని మొదటిగా ముందుకు వచ్చాడు. హమీదా కూడా ప్రియ కోసం నేను త్యాగం చేస్తానని చెప్పింది. చివరకు ఆనీ, రవి, శ్వేతా, ప్రియలు కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. అనంతరం బిగ్బాస్ ‘పదివేలు సరిపోవు సోదరా’ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కొన్ని రంధ్రాలున్న వాటర్ ట్యాంకులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు.
టాస్క్ ముగిసే సమయానికి ఎవరి దగ్గరున్న వాటర్ ట్యాంకులో ఎక్కువ నీళ్లుంటాయో వారే గెలిచినట్లు లెక్క! అని క్లారిటీ ఇచ్చాడు. ఈ టాస్కులో రవి, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ పోటీపడగా… ఫైనల్గా ప్రియ గెలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైలుకి పంపే ప్రాసెస్ని ప్రియ చదువుతుంది కాబట్టి.. ప్రియ ఐదోవారం కెప్టెన్ అయినట్టు ప్రజలు భావిస్తున్నారు. మరి అదెంతవరకు నిజమనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది.