సత్యదేవ్ కథానాయకుడిగా ఓల్డ్ టౌన్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. సత్యదేవ్ నటిస్తున్న 26వ చిత్రమిది. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ సత్యదేవ్తో పాటు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో ఒక నాయికగా ప్రియ భవానీ శంకర్ నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ తమిళ తారకిది తొలి తెలుగు సినిమా కానుంది. సినిమాలో నటించే మరో నాయికను ఎంపిక చేయాల్సిఉంది.