తమిళ చిత్ర పరిశ్రమలో వర్థమాన తారగా ఎదుగుతున్నది ప్రియ భవానీ శంకర్. టాలీవుడ్లో ప్రియా భవానీ అరంగేట్రం త్వరలోనే ఉంటుందని తెలుస్తున్నది. ఇక ఈ నాయిక తాజాగా తన కొత్త ఇంటిలోకి అడుగుపెట్టింది. ఈ గృహ ప్రవేశానికి ప్రియుడు రాజ్వేల్ రాజ్ అతిథిగా హాజరయ్యాడు.
ఈ ఇంట్లో వీరిద్దరు డేటింగ్ చేస్తారనే రూమర్స్ వచ్చాయి. త్వరలోనే వీరు పెండ్లి చేసుకుంటారని చెప్పుకుంటున్నారు. వీటిపై ప్రియా భవానీ శంకర్ స్పందిస్తూ…‘ఆయన మా ఇంటి గృహ ప్రవేశానికి అతిథిగా వచ్చారు.పెండ్లి సంగతి ఉంటే నేనే చెబుతాను. బీచ్ ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకోవడం నాకు ఇష్టం. అలాంటి బీచ్ సమీపంలో ఇళ్లు కట్టుకోవాలనేది నా డ్రీమ్. ఆ కల ఎన్నో ఏండ్లకు నెరవేరింది’ అని చెప్పింది.