Yatra 2 | 2019లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి (YS. Rajashekar) స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర (Yatra). మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా యాత్ర 2 (Yatra 2) వస్తుందని తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్లుక్ విడుదల చేశారు.
ముందు చెప్పినట్లుగానే యాత్ర 2 ఫస్ట్ లుక్ను ఉదయం 11 గంటలకు మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్లో ఒకవైపు జీవా ఉండగా.. మరోవైపు మమ్ముట్టి ఉన్నాడు. ఈ పోస్టర్లో ”నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్రెడ్డి కొడుకుని” అంటూ పోస్టర్లో రాసుకోచ్చారు. దీనితో పాటు మేకర్స్ విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.
Presenting the first look of #Yatra2. In cinemas worldwide from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @JiivaOfficial @ShivaMeka @MahiVraghav pic.twitter.com/4m4PhJsurF
— Mammootty (@mammukka) October 9, 2023
ఇదిలా ఉండగా.. యాత్ర ఫస్ట్ పార్టులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సెకండ్ పార్టులో మమ్ముట్టి, జీవా లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.