మల్హోత్రా ఎస్ శివమ్, శంకర్, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మన్నించవా’. రమేష్ గౌడ్ దర్శకత్వంలో మంజుల చవన్ నిర్మించారు. ఈ నెల 25న విడుదలకానుంది. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. చక్కటి విలువలతో కథ సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలుంటాయి’ అని చెప్పారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథగా మెప్పిస్తుందని నిర్మాత మంజుల చవన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జాన్భూషణ్, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, కెమెరా, దర్శకత్వం: రమేష్ గౌడ్.