Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా ఆదిపురుష్ షూటింగ్ను పూర్తీ చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక సలార్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K ప్రస్తుతం రామోజీఫిలింసిటీలో చిత్రికరణ జరుపుకుంటుంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా బిగ్బీ అమితాబ్బచ్చన్, ప్రభాస్ మధ్య సన్నీవేశాలను చిత్రీకరించారు. దీనిపై ప్రభాస్ ఇన్స్టాగ్రామ్లో బిగ్బీ ఫోటోను షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్త పరిచాడు.
నా కల నిజమైంది. లెజెండరీ అమితాబ్ సర్తో ఈరోజు ప్రాజెక్ట్-K సినిమా మొదటి షాట్ను పూర్తీ చేశాను అంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. సై-ఫై సినిమాగా తెరకెక్కుతున్నఈ చిత్రానిపై ప్రేక్షకులలో భారీ అంచనులే ఉన్నాయి.