రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో జగన్పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ని ఏకి పారేశాడు. బండ బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవన్ పైన వ్యాఖ్యలు చేసిన తరువాత కొందరు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని..కంటిన్యూ ఫోన్లు చేస్తున్నారంటూ పోసాని చెప్పుకొచ్చారు. తనను బెదిరిస్తున్నారని కూడా అన్నాడు.
బుధవారం అర్ధరాత్రి పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పోసాని స్పందించారు.పవన్ కల్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని అన్నాడు.ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుండి అలానే ఉన్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్లో కో డైరెక్టర్ ఏదో తప్పు చేశాడని కొట్టాడు. అతని తప్పు లేదని తెలిసిన కూడా సారీ చెప్పలేదు.
ఆయన ఎప్పటి నుండో అలా ఉన్నాడు. ఎవరినైన తిట్టడం, కొట్టడం చేస్తాడు. తను ఎవరినైన ఏమైన అనొచ్చు, తనని మాత్రం ఎవరు ఏమి అనకూడదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్లని బట్టలు ఇప్పి కొట్టండని అన్నారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ పోసానిని బట్టలు విప్పి కొడతాం అంటున్నారు. నాయకుడు ఎలా ఉంటాడో, వారి కార్యకర్తలు అలానే ఉంటారు.
నాకు ఎవరితో శృతత్వం లేదు. 35 ఏళ్ల నుండి సినిమా పరిశ్రమలో ఉన్నా. ఎవరితో గొడవపడలేదు. షూటింగ్ కి టైంకి వెళతా. అతడిని ప్రశ్నించా కాబట్టి అతను నాకు శతృవుగా మారాడు. నేను ఇలాంటి సన్నాసులని చాలా మందిని చూశాం. 1981 నుండి రాజకీయాల్లో ఉన్నా. ఇలా బెదిరించడాలు చాలా చూశా. రాళ్లకు, దెబ్బలకు భయపడను. పవన్ కళ్యాణ్ని నేను ఒక్కడినే చెప్పుతో కొడతాను. మహా అయితే నన్ను చంపుతారేమో. ఫ్యాన్స్కి డబ్బులు ఇచ్చి పంపడం ఏంటి? రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటి సంబంధం అంటూ పోసాని పవన్పై నిప్పులు చెరిగారు.